Editor Voice

  • మరుగున పడ్డ మాణిక్యం

     రాజధాని పేరు ని అమరావతి గా ప్రకటించిన మరుక్షణమే ఎలక్ట్రానిక్ మీడియా, పేపర్ మీడియా మరియు నెటిజన్లు అమరావతి పేరు వెనుక కధల్ని , దాని యొక్క చారిత్రిక నేపధ్యాన్ని పుంఖాను పుంఖాలుగా ప్రసారం చేశారు, ఇంకా చేస్తున్నారు. మన రాజధాని అమరావతి అని చెప్పుకోవటానికి ఒక ఆంధ్రుడిగా నేనెంతో గర్వపడుతున్నాను. అమరావతి ప్రాశస్త్యం తెలుగు జాతి చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. 

    . ...readmore

  • కువైట్ లో మనఘంటసాల వారు

     ఉద్యోగ నిర్వహణలో భాగంగా పలు దేశాలకి వెళ్ళాల్సి ఉంటుంది. గతంలో పోలండ్లో పని చేసినపుడు దాదాపు అన్ని ఐరోపా దేశాల్లో పర్యటించాను. కొంతకాలంగా దుబాయ్ లో పని చేస్తుండటంతో మా సంస్థకి సంభందించిన వ్యాపార కార్యకలాపాలు మధ్య ప్రాచ్యంలో ఉన్న ఒమన్ , కువైట్ , ఖతర్ , సౌదీ అరేబియా , బహ్రెయిన్ లలో విస్తరించి ఉన్నాయి. ఎక్కడికి  బిజినెస్ ట్రిప్ వెళ్ళినా స్వామి కార్యం , స్వ కార్యం రెండూ కలిసి వచ్చేలా ప్లాన్ చేసుకుంటాను. ఆఫీసు పనులయ్యాక కనీసం ఒక్క రోజు ని అక్కడి విశేషాలని , చారిత్రక అంశాలని తెలుసుకోవటానికి పెట్టుకుంటాను.

    . ...readmore

  • చరిత్ర పరిరక్షణలో ఐదేళ్ళు

     నేటికి వెబ్ సైట్ ప్రారంభించి ఐదేళ్ళు గడిచాయి. ఐదేళ్ళ క్రితం నా తోటి మిత్రులంతా వారి వితరణని పెట్టుబడిగా పెడితే నేను నా సమయాన్ని, ఆలోచనల్ని పెట్టుబడిగా పెట్టి ఈ వెబ్ సైట్ ని ప్రారంభించాం.ఈ పెట్టుబడికి ప్రతిఫలం ఉండదని మాకు తెలుసు. శ్రీ గొర్రెపాటి రవి సుధాకర్ నాకు నైతిక స్థైర్యాన్ని ఇవ్వటంతో పాటు వెబ్ సైట్ నిర్మాణంలో వెన్ను దన్నుగా నిలబడ్డారు.

    . ...readmore

  • యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

     ఈ రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ దినోత్సవం. మన దేశం తర్వాత నేను నివసించటానికి అత్యంత ఇష్టపడే ప్రాంతం ఇది. నేను యూరప్ లో కొంత కాలం నివసించినా నాకు దుబాయ్ అంటేనే ఎక్కువ ఇష్టం. నేను తొలిసారి చూసిన విదేశం దుబాయ్. అందుకేనేమో ఈ దేశం అన్నా ఇక్కడి ప్రభుత్వ విధానాలన్నా నాకు అమితమైన ఇష్టం , ఆసక్తి . మొత్తంగా నేను ఈ దేశంలో నివసించింది 4 సంవత్సరాలు. మూడు జాతీయ దినోత్సవాలని ఈ దేశంలో చూశాను

    . ...readmore

  • ​​ముగిసిన శకం

     ఏరా మనవడా ఎప్పుడొచ్చావ్, ఏరా అల్లుడూ ఏమిటి పిల్లల కబుర్లు , ఇకపై ఊరు వెళ్ళినపుడు ఇలాంటి పలకరింపులు మనకి వినిపించవు. రోడ్డు మీదకి రాగానే కనిపించే ఆ మందుల షాపు ఇక తెరుచుకోదు. అవును,  50 ఏళ్లుగా మన గ్రామస్తుల జీవనంలో పెనవేసుకుపోయిన గోపాలకృష్ణా మెడికల్ ఎంపోరియం ప్రస్థానం ముగిసింది. గ్రామంలో 50 ఏళ్ల క్రితం స్థాపించిన తోలి మందుల షాపు ఇక చరిత్రలోకి వెళ్ళిపోయింది.

    . ...readmore

  • విడిపోయిన జ్ఞాపకాలు

     ఎన్నో భావోద్వేగాల మధ్య రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు వారికి రాజకీయ నాయకుల అభిప్రాయాలు, ఆలోచనలు తప్ప సామాన్యుడి ఆవేదన, ఆక్రోశం తెలియకపోవచ్చు. ఈ దేశం రెండుగా విడిపోయినప్పుడు జరిగిన ప్రాణ నష్టం 68 ఏళ్ల తరువాత ఇప్పుడు గుర్తు చేసుకున్నా మనసును కలచి వేసే ఉదంతం అది. నాకు సంబంధించినంతవరకూ నా గొప్ప జ్ఞాపకాలన్నీ పొరుగు రాష్ట్రంలో ఉండిపోయాయి.

    . ...readmore

  • తెలుగు వెలుగు విద్యార్థి

     ఈ ఆర్టికల్ రాయటం కొంచెం ఆలస్యం అయింది.18 ఏళ్లకే ఫేస్బుక్ ని స్థాపించిన మార్క్స్ జుకర్ బెర్గ్ , కాలేజి రోజుల్లోనే గూగుల్ ని స్థాపించిన లారీపేజ్ ల గురించి ఆశ్చర్యంగా, అద్భుతంగా వర్ణించిన ఎన్నో కధనాలు మీరు చదివి ఉంటారు. కాని ఇవన్నీ సమాచార విప్లవం వచ్చాక గత 15 ఏళ్లలో జరిగిన విషయాలు. 60 ఏళ్ల క్రితం మన ఘంటసాల హైస్కూల్ లో 10 వ తరగతి చదువుతున్న ఒక విద్యార్ధి తన 20 ఏళ్ల వయసులో స్థాపించిన ఓ మాస పత్రిక గురించి, 61 ఏళ్లుగా అప్రతిహతంగా సాగుతున్న ఆ పత్రిక జైత్రయాత్ర గురించి , ఆ విద్యార్ధి గురించి రాయాలని చాలా సార్లు అనుకున్నాను.

    . ...readmore

  • ​బడ్డీ నాగయ్య ​

     మన గ్రామం తర్వాత నాకు అదే స్థాయి అనుబంధం ఉన్న గ్రామం, పొరుగున ఉన్న  కొత్తపల్లి. మా అమ్మగారిది అదే ఊరు కావటం, చిన్నపటినుండి ప్రతి ఆదివారం సెలవు వస్తే అమ్మమ్మ వాళ్ళింటికి పరిగెత్తటం ఆ ఊరుతో నా అనుభందాన్ని మరింత బలపడేట్టు చేసింది. చిన్నపుడు ఎన్నో ఆదివారాల ఆటవిడుపులు, కోతి కొమ్మచ్చి, శివాలయంలో ఆడుకున్న పొగడ చెట్టు నీడ, కింద పడితే ఏరుకున్న పొగడపూలు,1990 లో తుఫానుకి ఆ చెట్టు పడిపోతే ఆ వంగిన కొమ్మ మీద ఊగిన ఉయ్యాల. పూజారి జగం గారి మంచి నీళ్ళ పంపు, 

    . ...readmore

  • నాలుగేళ్ళ ప్రయాణం

     వెబ్ సైట్ ప్రారంభించి నేటికి నాలుగేళ్ళు గడిచాయి. ఇది ఇంత కాలం మనగలుగుతుందని, ఇంతమంది అభిమానాన్ని చూరగొంటుందని నేనూ అనుకోలేదు. 2013 సంవత్సరాన్ని ఒక సారి సింహావలోకనం చేసుకుంటే, వార్తా విశేషాలన్నీ ఎప్పటికప్పుడు అందించినా ఉద్యోగరీత్యా దేశాలు మారటం వల్ల కధనాలు మరియు ఎడిటర్ వాయిస్ క్రమం తప్పకుండా రాయలేకపోయాను.

    . ...readmore

  • రోడ్డు మీది - పేరు మీది

    ఈ మధ్య ఒకే తరహా ఆలోచనలు కలిగిన మూడు అనుభవాలు నాకు ఎదురయ్యాయి. ఎలాగూ తెలంగాణా విడిపోయింది, కానీ మన వాళ్ళకి మాత్రం హైదరాబాదు మీద మమ కారం మాత్రం పోవట్లేదు. మిగతా తెలంగాణా జిల్లాల మీద ప్రేమ ఉన్నా లేకపోయినా హైదరాబాదు మీద మాత్రం ఎనలేని భావోద్వేగాలు పెనవేసుకుని ఉన్నాయి. వాళ్ళు పొమ్మంటున్నా మనకి మాత్రం ఎందుకో దానిని వదులుకోవటం ఇష్టం లేదు. మానసిక పరమైన అనుభంధం ఒకటైతే మళ్ళీ కొత్త రాజధాని నిర్మించుకోవాలంటే అయ్యే ఖర్చు కొత్తగా ఏర్పడే రాష్ట్రం మీద పడుతుందని ఆర్ధిక నిపుణులు, మేధావుల ఆందోళన మరో కారణం.

    . ...readmore

  • వందేళ్ళ పంచాయితీ

     గ్రామానికి ఒక సర్పంచ్ ఉంటాడు అనే అవగాహన వచ్చాక నేనెరిగిన మొదటి వ్యక్తి శ్రీ సంకా నాగ బాల సుబ్రహ్మణ్యం గారు.1988 నుండి 1995 వరకు మన గ్రామానికి సర్పంచ్ గా ఆయన సేవలందించారు. అప్పటికి 75 సంవత్సరాల ఘంటసాల గ్రామ పంచాయితీ చరిత్రలో తొలి కమ్మేతర సర్పంచ్ ఆయనే. అప్పటిదాకా 10 మంది కమ్మ సామాజిక వర్గం నుండే ఈ పదవికి ప్రాతినిధ్యం వహించారు. సంకా నాగ బాల సుబ్రహ్మణ్యం గారి హయాంలో నేను ప్రత్యక్షంగా చూసిన ముఖ్యమైన కార్యక్రమాలు రెండు. ఒకటి మంచినీళ్ళ టాంక్ ప్రారంభోత్సవం. రెండు పంచాయితీ వజ్రోత్సవాలు. 1993 నాటికి పంచాయితీ ఏర్పడి 75 సంవత్సరాలు కావటంతో ఆ వేడుకలని వైభవంగా నిర్వహించారు. 

    . ...readmore