"భూ" కైలాస్

ఉత్సాహంగా ముగిసిన ఎడ్లపందాలు

ఉత్సాహంగా ముగిసిన ఎడ్లపందాలు

వైభవంగా విగ్రహ ప్రతిష్ట

వైభవంగా విగ్రహ ప్రతిష్ట

నందమూరి జ్ఞాపకాలు

నందమూరి జ్ఞాపకాలు

50 లక్షల వ్యయంతో స్మశానవాటిక అభివృద్ధి

50 లక్షల వ్యయంతో స్మశానవాటిక అభివృద్ధి

Editor Voice

 ఎవరికైనా మంచి ఉద్యోగం వస్తే ముందుగా వాళ్లకి కంగ్రాట్స్ చెప్తాం. ఆ తరువాత తీరుబడి గా మిగతా విషయాలన్నీ తెలుసుకుంటాం. కానీ నాకీ మధ్య కొన్ని ఆశ్చర్య కరమైన అనుభవాలు ఎదురయ్యాయి. గత ముప్పై ఎనిమిది వారాలుగా ఎడిటర్ వాయిస్ రాస్తున్నా.ఈ మధ్య నాకు పోలాండ్ లో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగం రావటంతో ఆ సంతోషాన్ని సన్నిహితులు, శ్రేయోభిలాషులతో పంచుకున్నాను. అది అలా అలా అందరికి తెలిసి కొంతమంది నాకు ఫోన్ చేసి అడిగిన మొదటి ప్రశ్న, నువ్వు అక్కడికి వెళ్ళిపోతే వెబ్ సైట్ పరిస్థితేంటి? 

 

 “The greatness of a nation and its moral progress can be judged by the way its animals are treated" దేశం యొక్క గొప్పతనం, నైతిక విలువలు ఆ దేశంలో జంతువుల్ని,మూగజీవాలని పరిరక్షించే విధానాల ద్వారా తెలుస్తాయని మహాత్మా గాంధీ చెప్పిన సూక్తి మన గ్రామం లో పశువుల ఆస్పత్రి లో కనిపిస్తుంది.మనం పట్టించుకోని చాలా ముఖ్యమైన విభాగాల్లో పశువుల ఆసుపత్రి ఒకటి. మనుషులకి నోరుంది, మన భాధని డాక్టర్ కి చెప్పుకోవటానికి ఆ భగవంతుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడు. ఆ భాధని విని తగిన వైద్యం చేసే అవకాశం డాక్టర్లకి ఉంది.

 

 

శ్రీ వేమూరి వెంకట కృష్ణారావు గారు

ఘంటసాల గ్రామానికి చెందిన వ్యక్తి కాకపోయినా,ఘంటసాల గ్రామంతో రాజకీయంగానూ వ్యక్తిగతం గానూ విడదీయలేని అనుభంధం ఉన్న వ్యక్తి వేమూరి వెంకట కృష్ణారావు గారు. నేను ఆరవ తరగతి హైస్కూల్ లో చదువుకునేటప్పుడు స్కూల్ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిధి గా వచ్చారు. ఆ సంవత్సరం నాకు ఇంగ్లిష్ లో ఫస్ట్ ప్రైజ్ రావటం తో ఆయన చేతులమీదుగా ఆ బహుమతిని అందుకున్న జ్ఞాపకాలు నాకున్నాయి.
 

 అవి నేను మొవ్వ గ్రామంలో ఇంటర్ చదువుతున్న రోజులు. మన గ్రామం నుంచే కాకుండా చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా ఎంతో మంది విద్యార్ధులు అక్కడ చదువుకోవటానికి వచ్చేవారు. అప్పటిదాకా సొంత గ్రామం లోని స్నేహితులతో చదువుకున్న మాలాంటి వాళ్లకి వేరే గ్రామాల విధ్యార్ధులతో కలిసి చదువుకోవటం అదే మొదటి సారి. స్కూల్ దశ నుంచి కాలేజి జీవితం లోకి వేసిన తొలి అడుగు ఇంటర్ కాలేజికే. ఒక రోజు మాథ్స్ క్లాస్ జరుగుతుంటే వెనక ఏదో చిన్నగా ఇద్దరు విద్యార్ధుల మధ్య గొడవ అయింది. 

 

 కొంతమంది వ్యక్తులు తాము చేసే ప్రతి పనిలోనూ తమదైన ముద్ర వేస్తుంటారు. తాము ఎంచుకున్న రంగం లో మైలు రాయిలా నిలిచిపోయే పనులతో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారు. మన గ్రామ పంచాయితీ విషయానికి వస్తే చెప్పుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం,పంచాయితీ ఏర్పడి 94 సంవత్సరాలు. ఆ కాలాన్ని రెండు భాగాలుగా విభజిస్తే దోనేపూడి సీతారామయ్య గారికి ముందు మరియు ఆయన తర్వాత అని ప్రస్తావించాలి.