ఘంటసాల గ్రామానికి చెందిన శ్రీ గొర్రెపాటి శరత్ బాబు గారి చిన్న కుమారుడు వంశి కృష్ణ అమెరికా అధ్యక్షుడు నుండి లభించే ప్రెసిడెన్షియల్ స్కాలర్ షిప్ కి ఎంపిక అయ్యాడు. ప్రతి సంవత్సరం 36 లక్షల మంది విద్యార్ధులు గ్రాడ్యుయేషన్ పూర్తీ చేసుకుంటుంటే అందులో కేవలం 161 మంది మాత్రమే ఈ స్కాలర్ షిప్ కి ఎంపిక అవుతారు. వీరందరికీ అమెరికా అధ్యక్షుడి చేతులమీదుగా Presidential Scholor అనే మెడల్ ని అందచేస్తారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి 1990 వ దశకంలో , స్వశక్తితో అమెరికా కి వెళ్ళిన మన గ్రామస్థుల వారసులు అమెరికాలో కూడా తమ ప్రతిభని నిరూపించుకోవటం మన గ్రామానికి గర్వకారణం.