Editor Voice

  • తెలుగుదేశం రామకృష్ణ

     ఘంటసాలలో ప్రతి రోజూ ఈ పిలుపు వినిపిస్తూనే ఉంటుంది. శుభకార్యాలకి పిలుపు లైనా మంచి కి చెడుకీ పెద్దరికం వహించాలన్నా ఆయన పేరు “తెలుగుదేశం” రామకృష్ణ గానే జనం నోళ్ళలో నానుతూ ఉంటుంది.1982 లోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభ్యుడుగా గొర్రెపాటి వెంకటరామకృష్ణ అందరికీ సుపరిచితుడే. ఆనాటి నుండి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ లో వుంటూ ఇంటి పేరుతో కన్నా పార్టీ పేరుతో " తెలుగుదేశం రామకృష్ణ " గా సార్ధక నామధేయుడు .

    . ...readmore

  • వందేళ్ల పంచాయితీ -2021

     దేశానికి స్వాతంత్రం రాకముందు ముందు నుండి గ్రామ పరిపాలనా వ్యవస్థ ఉంది.దీనిని మొదట్లో పంచాయితీ బోర్డ్ అని పిలిచేవారు. దానికి చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఉండేవారు. 18. 04.1918 న ప్రారంభమైన పంచాయితీ బోర్డుకి తోలి చైర్మన్ వేమూరి వెంకయ్య గారు, వైస్ చైర్మన్ గొర్రెపాటి వెంకయ్య గారు. 1934 వరకు 16 సంవత్సరాల పాటు ఈ ఎన్నిక ఏకగ్రీవమే.అప్పట్లో ఘంటసాల పాలెం కూడా ఒకే పంచాయితీ కింద ఉండేది.

    . ...readmore

  • సార్ధక నామధేయుడు డాక్టర్ నవనీత కృష్ణ

     ముప్పై ఏళ్ల పాటు అమెరికా ఆసుపత్రుల్లో  వైద్యం చేసి ఎంతో మందికి ప్రాణదానం చేసి అలసిపోయిన ఆ చేతులు సొంతూర్లో ఎడ్లు పరిగెత్తుతుంటే చప్పట్లు కొడతాయి. ఊర్లో కి వచ్చినపుడు చిన్ననాటి స్నేహితుడు కనపడగానే ఏరా ఎంకయ్యా ఎవసాయం ఎట్టా ఉందిరా అనే పలకరింపు అప్పటిదాకా అమెరికన్ యాస లో మాట్లాడే ఆంగ్ల భాష నుండి పదహారణాల తెలుగు లోకి మారిపోతుంది. ఆనందం అమెరికాలో ఎక్కడుంది అబ్బాయ్, ఇదిగో ఈ పొలం గట్ల మీద పాడి ఆవుల మధ్యన , ఆప్యాయంగా పలకరించే మట్టి మనుషుల మధ్య ఉంది అంటూ ప్రతి చిన్న విషయం లోనూ ఆనందాన్ని వెతుక్కునే మనిషి డాక్టర్ గొర్రెపాటి నవనీత కృష్ణ గారు. అంతర్జాతీయ తెలుగు సమాజంలో అత్యున్నత సంస్థ తానా కి అధ్యక్షుడుగా పని చేసిన తర్వాత కూడా ఫ్లైట్ లో తన పక్కన కూర్చున్న వ్యక్తికి నా పేరు నవనీత కృష్ణ అండీ మాది ఘంటసాల, మీది ఏ ఊరు అని అడిగి స్వయంగా పరిచయం చేసుకునే నిగర్వి.

     

     

    . ...readmore

  • శ్రీ N.G. రంగా విగ్రహావిష్కరణ 1972

    అది 1972 వ సంవత్సరం నవంబరు 9 వ తెదీ , రాష్ట్రంలో ప్రముఖ నాయకుల కార్లన్నీ ఘంటసాల చేరుకున్నాయి. ఆరోజు జరగబోయే వేడుకకి ఎక్కడెక్కడి నుండో అతిధులంతా ఉత్సాహంగా ఘంటసాల గ్రామం చేరుకున్నారు. ఘంటసాల గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారంతా ఆ వేడుక చూడటానికి జలధీశ్వరాలయం ముందుకి చేరుకున్నారు. ఆరోజున ఇద్దరు మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం. ఒకరు రైతు నాయకుడు శ్రీ N.G. రంగా మరొకరు శ్రీ కిసాన్ గొర్రెపాటి వెంకటసుబ్బయ్య. 

    . ...readmore

  • ఊరుకి కళ వచ్చింది

    దాదాపు ఏడాదిన్నర తర్వాత ఇండియా కి వెళ్ళాను.ఊర్లోకి అడుగు పెట్టగానే ఒక్క క్షణం ఇది మన ఊరేనా అనే సందేహం కలిగింది. పాడుబడిన పెంకుటిళ్లు , నిర్మానుష్యంగా మారిన దొడ్లు, బిక్కు బిక్కు మంటూ గడిపే ముసలి ప్రాణాలు, లంకంత కొంపలో ఒక్కరో ఇద్దరో మనుషులు , ఆలనా పాలనా లేని రోడ్లు, పిల్లలంతా వలస వెళ్లిపోగా కళ తప్పిన గ్రామీణ జీవితం. ఐదేళ్ల క్రితం ఊర్లో పరిస్థితులు ఇలా ఉండేవి. కానీ ఇప్పుడు ఊరు ను చుస్తే గత ఐదేళ్ళలో ఇంత మార్పా అనేలా సిమెంటు రోడ్లు , పెంకుటిళ్ల స్థానం లో ఆధునిక భవంతులు, తీర్చిద్దిద్దిన వాకిళ్లు, సిమెంటు రోడ్లు ,ప్రతి ఒక్కరిలో ఉత్సాహం, పెరిగిన జనాభా, కొత్తకళ సంతరించుకున్న గ్రామీణ జీవితం.

    . ...readmore

  • అభ్యుదయవాది-వీరపనేని

    వీరపనేని సుబ్రహ్మణ్యం , పరిచయం అవసరం లేని పేరు అనేకంటే ఈ తరానికి పరిచయం చెయ్యాల్సిన పేరు అనటం సబబు. ఎందుకంటే మన గ్రామంలో జన్మించి ఇక్కడే చదువుకుని హైదరాబాద్ లో స్థిరపడిన ఘంటసాల ముద్దు బిడ్డ వీరు . పరిచయం చేయాల్సిన పేరు అని ఎందుకు చెప్పానంటే , గ్రామభివ్రుద్దిలో పాల్గొంటూ జన్మ భూమి కోసం ఎంత ఖర్చు చేసినా ఏనాడూ తమ ఉనికిని పెద్దగా చాటుకోవటానికి ఇష్టపడని వ్యక్తి శ్రీ సుబ్రహ్మణ్యం .

    . ...readmore

  • చరిత్ర పరిరక్షణలో 8 ఏళ్ళు

     2010 వ సంవత్సరం, సరిగ్గా ఇదే రోజు ,ఎనిమిదేళ్ల క్రితం వారం రోజుల ముందు నుండి మేము చేసిన ప్రచారం , ఊరూరా ఫ్లెక్సీ లు , మనఘంటసాల. నెట్ వెబ్సైట్ ప్రారంభోత్సవం అంటూ ఇంటింటికీ పంపిన ఆహ్వానాలతో , పిల్లా పెద్దా అందరూ సాయంత్రం  గంటల కల్లా జలధీశ్వరాలయం ముందు ఆసీనులయ్యారు. గ్రామానికో వెబ్ సైట్ అనేది అసలు ఎవరి ఊహకి అందని విషయం. అదీ కాకుండా అప్పటికి ఈ జియో నెట్వర్క్ , స్మార్ట్ ఫోన్ లు లేవు. ఇంటర్నెట్ అనేది ఇంకా గ్రామంలో కనీసం పది శాతం మందికి కూడా అందుబాటులో లేని సమయం అది. ఆ సమయంలో కొద్దిమంది మిత్రులు , ప్రవాసులు అందరం కలిసి దీనికి రూపాన్నిచ్చాము. చూస్తుండగానే 8 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంతకుముందు కంటే ఇప్పుడు సమాచారం మరింత త్వరగా అందుతోంది. ఎందుకంటే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ రిపోర్టర్ గా మారిపోయారు. గ్రామంలో ఏది జరిగినా నిమిషాల్లో ఫేస్బుక్ లో ప్రత్యక్షమవుతుంది. తద్వారా ఘంటసాల పేజీ కి కూడా ఆ సమాచారం తక్షణం చేరుతోంది.

    . ...readmore

  • దుబాయ్ రామస్వామి

     హైస్కూల్ లో చదువుకునేటప్పుడు నేనంత మంచి విద్యార్ధిని కాదు.క్లాసులో మార్కుల పరంగా చూస్తే గొప్ప చదువరిని కూడా కాదు.ఆ వయసులో చేసే కొన్ని కొంటె పనుల వల్ల చుట్టు పక్కల వాళ్ళ విమర్శలు వినాల్సి వచ్చేది. ఏదో సంఘటన జరిగినప్పుడు నన్ను అందరూ ఇలాగే విమర్శిస్తుంటే ఓ రోజు మా ఇంటి పక్కావిడ,ఈ వయసులో అందరూ అలాగే ఉంటారు.

     
    . ...readmore

  • కర్మ యోధుడు కృష్ణారావు

     కర్మ యోధుడు కృష్ణారావు పుస్తకం ఆవిష్కరణ అనే వార్తని ప్రసార మాధ్యమాల్లో చూసి ఆ పుస్తకం అంటే ఆసక్తి కలిగింది. ఆలా కలగటానికి ముఖ్య కారణాలు మూడు.

    ఒకటి : ఎరుపు రంగులో ఉన్న పుస్తకం అట్ట చూడగానే అదొక కమ్యూనిస్టు యోధుడి ఆత్మ కథ అనిపించటం.
    రెండు : అస్తమించని రవి పుస్తక రచయిత శ్రీ ఖాదర్ మొహినుద్దీన్ గారు ఈ పుస్తక రచయిత అవ్వటం
     

    . ...readmore

  • సప్త వర్ణాల ఇంద్రధనుస్సు

                                                    సప్త వర్ణాల ఇంద్రధనుస్సు

    అప్పుడే ఏడేళ్లు గడిచిపోయాయా అనిపిస్తుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో విజయాలు ,మైలు రాళ్లు , ప్రశంసల వర్షం గుర్తు రావటంతో పాటు అసలిదంతా చేసింది మేమేనా అనిపిస్తుంది. ఈ ఏడేళ్ల లో ఈ ఇంద్రధనుస్సు కి రంగులద్దిన మహానుభావులందరికీ నా వందనాలు.ముఖ్యంగా నన్ను వెన్నంటి నడిపించిన నా మిత్రులు, మనఘంటసాల టీమ్. వాళ్ళే లేకపోతే ఈ వెబ్ సైట్ లేదు. అసలు వాళ్లలో కొంతమందిని ఈ ఏడు సంవత్సరాల్లో ఎప్పుడూ నేరుగా కలవలేదంటే మీరు నమ్మరేమో.

     

    గడచిన ఏడు సంవత్సరాల్లో గ్రామంలో జరిగిన ప్రతి సంఘటన ఈ వెబ్సైట్ లో పొందుపరచబడ్డాయి. ముందు తరాల వారికి ఎప్పుడు ఏ సమాచారం కావాలన్నా ఒక్క క్లిక్ తో అందుబాటులో ఉంది. 

    . ...readmore

  • అవిశ్రాంత ఉపాధ్యాయుడు మూల్పూరి

     మనిషి బతికుండగా ఆ మనిషిని గురించి చెప్పటానికి మాటలు కరువవుతాయేమో. మనిషి పోయాక ఆయన జ్ఞాపకాలు ముప్పిరిగొంటాయి. చేసిన మంచిపనులన్నీ కళ్ళముందు కదులుతుంటాయి. వాళ్లతో గడిపిన ప్రతి క్షణం ఎంతో విలువైనది గా అనిపిస్తుంది. LKG నుండి 5 తరగతి వరకు నా చదువు లయోలా కాన్వెంట్ లో సాగింది. 1990 సంవత్సరం మే నెలలో వచ్చిన తుఫాను తర్వాత జూన్ లో హైస్కూల్ తెరవగానే 6 వ తరగతి లో చేరటానికి వెళ్ళినపుడు మొట్టమొదటి సారి చెన్నారావుగారిని చూశాను. ఆయన అప్పుడు ప్రధానోపాధ్యాయులు గా ఉన్నారు.నాన్న ఆయన్ని కలిసి మావాడే, కొంచెం చూస్తూ ఉండండి అని చెప్పారు. పంచె కట్టు తో ఆకాశపు నీలం రంగు స్కూటర్ మీద ఆయన వస్తున్నారంటే స్కూల్ వసారాలన్నీ ఖాళీ అయిపోయేయి. ఎక్కడివాళ్ళు అక్కడ క్లాసుల్లోకి వెళ్ళిపోయేవారు.అప్పటికే ఆయన రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా అవార్డు పొందారు. నాకు గుర్తున్నంత వరకు నేను చేరిన తర్వాత కొద్దీ నెలలే ఆయన హెడ్మాస్టర్ గా ఉన్నారు.ఎందుకంటే ఆ సంవత్సరమే ఆయన రిటైర్మెంట్.అదే సంవత్సరం ఆయన రిటైర్ అయ్యాక అమెరికా పర్యటనకి వెళ్లారు.

    . ...readmore