శ్రీ వేమూరి బలరాం వితరణBack to list

 స్వాతి పత్రిక అధినేత, మన గ్రామస్తులు శ్రీ వేమూరి బలరాం గారు గ్రామ శివార్లలో ఉన్న బ్రహ్మం గారి గుడిని సందర్శించారు. గత సంవత్సరం జూన్ లో ధ్వజ స్తంభ ప్రతిష్ట కొరకు 1. 10 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. పని ఒత్తిడి రిత్యా ధ్వజ స్తంభ ప్రతిష్ట కి రాలేకపోయిన ఆయన ఇటీవల షష్టి కి విచ్చేసినపుడు ఈ ఆలయాన్ని సందర్శించి అభివృద్ధి పట్ల సంతోషం వ్యక్తం చేసారు. ఇంకా ఈ కార్యక్రమం లో మాజీ జడ్పీ చైర్మన్ శ్రీ గొర్రెపాటి వెంకట రామ కృష్ణ, ఉప సర్పంచ్ శ్రీ గొర్రెపాటి సురేష్ లతో పాటు ఘంటసాల పాలెం సర్పంచ్ శ్రీ వేమూరి సాయి ఇంకా పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. 

 

 
 
 
 
 
 
Dated : 29.12.2023