తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త ,విశ్వేశ్వరాలయ నిర్వాహక ధర్మకర్త శ్రీ వేమూరి నరసింహారావు ఈ నెల 01.06.2012 న దివంగతులయ్యారు.ఆయన వయస్సు 75 సంవత్సరాలు. తెలుగు దేశం పార్టీ స్థాపించిన నాటి నుండి ఈనాటి వరకు అనేక పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉండటం, వయసు పెద్దది కావటంతో గుండె పోటుతో మరణించారు. ఆయనకి ముగ్గురు కుమారులు. వీరి తండ్రి ఏటికాడ రాఘవయ్య గా గ్రామస్తులకు సుపరిచితం. అంత్య క్రియలు ఈ ఆదివారం 10.06.2012 న జరుగుతాయి.