​బుద్ధుని ముఖ ప్రతిమ లభ్యం Back to list

 

​ఈ రోజు గ్రామంలో బుద్ధుని ముఖ ప్రతిమ లభించింది. దిరిశం వాని గూడెం దగ్గరలో ఉన్న పెన్నేరమ్మ దిబ్బ దగ్గర కాకి నాంచారయ్య అనే వ్యక్తికీ ఇది దొరకటంతో ఆయన దయ్యన్న గారి రామ కృష్ణ గారికి చూపించారు. తదనంతరం గొర్రెపాటి వెంకట రామ కృష్ణ గారి ద్వారా పురావస్తు శాఖ కి అందచేయటం జరిగింది. ఇన్ని సంవత్సరాల్లో మన గ్రామంలో దొరికిన బుద్ధ ప్రతిమలన్ని తల భాగం లేకుండా లభించినవే. కేవలం పారిస్ లో ఉన్న బుద్ధ విగ్రహానికి మాత్రమే తల భాగం ఉంది. ఘంటసాలలో మొత్తం అయిదు స్తూపాలున్నాయి.దక్షిణం వైపు ఉన్న కోటదిబ్బ,పశ్చిమాన ఉన్న ఎర్రంపాళ్ల దిబ్బ,మాలపల్లె లోని పెన్నేరమ్మ దిబ్బ, ఉర్లోనే ఉన్న కోడిపందాల దిబ్బ తూర్పున ఉన్న లంజ దిబ్బ. స్తూపం అనగా సంస్కృత శబ్ధం, దీని అర్ధం దిబ్బ.​ మౌర్య చక్రవర్తి అశోకుడు భౌద్ధ మత ప్రచారం కోసం క్రీస్తుపూర్వం 249వ సంవత్సరం లో మహదేవుడనే భౌద్ధ భిక్షువు ను దేశంలోని వివిధప్రాంతాలకు పంపాడని మహదేవుడు తన వెంట తెచ్చిన భౌద్ధ ధాతువులను ఘంటసాల,నాగార్జునకొండ,అమరావతి లలో నిక్షిప్తం చేశాడని 'దివ్య వాదన 'అనే గ్రంధం లో వివరించబడింది.ప్రస్తుతం ఘంటసాల లో ఉన్నంత పెద్ద స్తూపం నాగార్జునకొండ,అమరావతి ల లో లేదు.అదీ కాక మన స్తూపం  70శాతం యధాతధంగా ఉంది.మిగతా స్తూపాలు శిధిలం అయిపోగా పునర్నిర్మించారు .భౌద్ధ మతస్తులు తమ మత స్తూపాలను,సంఘారామములను,సహజ సుందర ప్రదేశములలోనూ విస్తార జలసంపదలున్న ప్రాంతాలలోనూ నిర్మించారు .బుద్ధభగవానుడు సకల భోగాలతో జీవనం సాగించే సమయం లో మానవ జీవితంలో దుఖ నివారణకి మార్గాన్ని అన్వేషించే ప్రయత్నం లో అర్ధరాత్రి వేళ భార్యాపిల్లలను, రాజ్యాన్ని విడిచి ఒక అశ్వము పై ఎక్కి వెళ్ళిపోతాడు.బుద్ధునికి ప్రియమైన ఆ అశ్వము పేరు కంటకము.ఆ కంటకము పేరిట నిర్మించబడిన మన గ్రామము కంటకశైల గా ప్రసిద్ధి పొంది ఆ తరువాత ఘంటసాల గా నామాంతరం చెంది ఉండవచ్చు.ఇక స్తూపం అంటే భౌద్ధం లో చైత్యం అని కూడా అర్ధం.అయిదు స్తూపాలు ఒకచోట ఉంటే అది మహాచైత్యం అంటారు కాబట్టి ఘంటసాల మహాచైత్యం.అనేక భౌద్ధ శిల్పాలు,పూసలు,రోమను నాణాలు,పాలరాతి స్తంభాలు ఈ స్తూపాల  సమీపం లో దొరికాయి.

Dated : 19.11.2014