దేశమంతా స్వచ్ఛ భారత్ నినాదంతో మారుమోగుతుంటే ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం బాలికలకు మరుగుదొడ్లు లేకపోవటం స్వచ్ఛ భారతంలో విషాదం. దానికి మన హైస్కూల్ మినహాయింపు కాదు.మన హైస్కూల్ కట్టి 72 సంవత్సరాలు, ఇప్పటికీ మూత్ర విసర్జనకు బాలబాలికలు పడే ఇబ్బండులు చూస్తుంటే కడుపు తరుక్కు పోతుంది. ఇక తాగునీటి పరిస్థితి మరీ దారుణం. చుట్టుపక్కల ఉన్న అన్ని మండలాల లో ఉన్న హైస్కూల్స్ కంటే ఘంటసాలలో ఉన్న హైస్కూల్ లోనే విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు.
. ...readmore" మనం మనుషులున్న సమాజంలో బతుకుతున్నాం కాబట్టే డబ్బులు సంపాదించగలుగుతున్నాం. అదే మనం ఒక దీవిలో మనుషుల్లేని చోట ఉంటే డబ్బులు సంపాదించగలిగేవాళ్ళం కాదు. మనకి డబ్బులు సంపాదించే అవకాశం ఇచ్చింది సమాజం. ఆ అవకాశం ఇచ్చిన సమాజానికి తిరిగి ఇవ్వటం మన భాద్యత. ఈ భాధ్యతని ఛారిటీ , దయ,సేవ అని పిలవకూడదు.ఇది కేవలం మన సంపదని మనకిచ్చిన సమాజంతో కలిసి పంచుకోవటం మాత్రమే "
. ...readmoreమన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపునందుకుని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి స్వచ్చ ఆంధ్రప్రదేశ్ పిలుపునందుకుని స్వచ్చచల్లపల్లి రథసారధి DR.D R K ప్రసాద్ గారి స్పూర్తితో గాంధీ జయంతి 2 అక్టోబర్ 2015 నాడు మన ప్రియతమనేత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి గారైన శ్రీ మండలి బుద్దప్రసాద్ గారి చేతులు మీదుగా స్వచ్చ ఘంటసాల కార్యక్రమం ప్రారంబించినాము.
. ...readmoreప్రస్తుతం ఉన్న కళ్యాణ మండపం గ్రామంలో ఉన్న అందరి అవసరాలని తీర్చలేకపోతున్న తరుణంలో , అదే ప్రాంగణంలో మరిన్ని వసతులతో మరో కళ్యాణ మండపం నిర్మించాలని కమిటీ నిర్ణయించింది. కేవలం పెళ్ళిళ్ళకి మాత్రమే కాకుండా చిన్నపాటి కార్యక్రమాలకి కూడా అందరూ కళ్యాణ మండపమే వినియోగిస్తుండటంతో ఒకేసారి రెండు మూడు కార్యక్రమాలు ఉన్నపుడు మిగతావారు అటు చల్లపల్లి గాని ఇటు మొవ్వ గాని వెళ్ళిపోవటం జరుగుతోంది.
. ...readmoreహరిత ఘంటసాల కార్యక్రమంలో భాగంగా తొలివిడతలో మెయిన్ రోడ్డు నుండి కళ్యాణమండపం వరకు ఇరువైపులా చెట్లు నాటాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క , దాని పరిరక్షణ కోసం ట్రీ గార్డులని విరాళంగా ఇవ్వాలని మన గ్రామ యువతకి విజ్ఞప్తి చేస్తున్నాము. ఒక్కొక్కరు ఒక మొక్క , ఒక ట్రీ గార్డుని ఇవ్వటం ద్వారా హరిత ఘంటసాలలో భాగస్వాములు కావాలని మా వినతి.
. ...readmoreశివ పార్వతులు ఏక పీఠము పై వెలసిన ఏకైక పురాతన క్షేత్రము శ్రీ బాల పార్వతీ సమేత జలదీశ్వర స్వామి వారి దేవాలయము పునర్వైభవము లో భాగస్వాములై అభివృద్ధికి విరాళాలు అందించండి.
. ...readmore. ...readmore
2009 లో వెబ్ సైట్ ప్రక్రియ ప్రారంభించిన నాటి నుండి నేటివరకు అందిన విరాళాల వివరాలు.
. ...readmore. ...readmore
ఈ భవనాల నిర్మాణానికి మరో 25 లక్షల రూపాయలు అవసరమవుతాయని అంచనా. 82 సంవత్సరాల వయసు లో ఈ బృహత్కార్యాన్ని భుజస్కందాల పై వేసుకుని అహర్నిశం పాటుబడుతున్నారు శ్రీ మూల్పూరి చెన్నారావు గారు.
. ...readmore